బోధన్, నవంబర్ 3: స్థానిక ఎమ్మెల్యేగా షకీల్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని, దీనిని ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోధన్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 15వ వార్డులో పార్టీ వార్డు ఇన్చార్జి గుమ్ముల విజయలక్ష్మీ అశోక్రెడ్డి, బోధన్ చక్రేశ్వర శివమందిరం చైర్మన్ బీర్కూర్ శంకర్ (బుజ్జి) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు కోడె శేఖర్, మీరజ్, ఆసిఫ్, అశోక్, బి.కవిత, పోచమ్మల రాజు, ప్రవీణ్, టీవీ రవి, పలువురు మహిళలు పాల్గొన్నారు.
నవీపేట, నవంబర్ 3: బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ను భార్టీ మెజారిటీ గెలిపిస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వొక్కెర్ల నర్సింగ్రావు పేర్కొన్నారు. మండంలోని మోకన్పల్లి గ్రామంలో పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సింగ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. సందర్భంగా గ్రామంలో నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడ తెడ్డు పోశెట్టి, దొంత ప్రవీణ్కుమార్, న్యాలకంటి అబ్బన్న, అల్లం రమేశ్, లోకం నర్సయ్య, స్థానిక ఎంపీటీసీ బేగరి జనార్దన్, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు టేకు లింగం, పార్టీ నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోధన్ రూరల్, నవంబర్3: సాలూరా, బోధన్ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే షకీల్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బెల్లాల్లో సర్పంచ్ రామావత్రాజు, నాయకులు పాల్గొన్నారు. సాలూరలో బీఆర్ఎస్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, డి.సాయిలు, శివకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.