ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 2: త్వరలో 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. పట్టణంలోని బీసీకాలనీ (2వ వార్డు)లో ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. మంజూరైన నిధులతో ప్రతివార్డులో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యుత్ అధికారులతో కలిసి కాలనీలకు వెళ్లి విద్యుత్ బిల్లును ఇంటి యజమానులకు అందజేశారు.
డిచ్పల్లి, మార్చి 2: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలుచేస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని నడ్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో మొత్తం 49 లక్షల మంది గృహలక్ష్మి లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. రూరల్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయి, అర్హులను గుర్తించి అందజేస్తామని తెలిపారు. డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల దవాఖానగా మారుస్తామని హామీనిచ్చారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రారంభించి, చెరువు సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం సాయం తీసుకుంటామన్నారు.
కామారెడ్డి, మార్చి 2 : అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 42వ వార్డులో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రేషన్కార్డు నిబంధనతో గృహజ్యోతిలో కొందరికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.