ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 23: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే యోచనలేదని, అందరం కలిసి ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపిద్దామని సూచించారు. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకురావాలన్నారు.
అనంతరం తమ శాఖల పనితీరును అధికారులకు ఎమ్మెల్యేకు వివరించారు. సమావేశంలో రెవెన్యూ, ఉపాధిహామీ, ఐకేపీ, పీఆర్, వ్యవసాయశాఖ, కో- ఆపరేటివ్, మార్కెటింగ్, సివిల్ సప్లయీస్, విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశాఖ, మిషన్ భగీరథ, రోడ్స్ అండ్స్ బిల్డింగ్స్, ఇరిగేషన్, విద్యుత్, ఐసీడీఎస్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ డెవలప్మెంట్, బీసీ డెవలప్మెంట్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ వెల్ఫేర్, మెప్మా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.