మాక్లూర్/ఆర్మూర్, అక్టోబర్ 10 : ‘ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను. నేను నమ్మేది రెండే రెండు. ఒకటి కేసీఆర్ను రెండోది ఆర్మూర్ ప్రజలను’ అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా మంగళవారం మాక్లూర్ మండలం కల్లెడ, ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో ‘ప్రజాశీర్వాద యాత్ర’ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయన కల్లెడలో అట్టహాసంగా ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ పదేండ్లలో మీ గ్రామాల అభివృద్ధికి ఏ చేశానో చెప్పడం బాధ్యతగా భావించి మీ వద్దకు వచ్చానన్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను లెక్కలతో సహా వివరించారు. నియోజకవర్గ ప్రజలు పెంచుకున్నబిడ్డను పదేండ్లుగా నియోజకవర్గ ప్రగతికి చెమటను ధారపోస్తున్నానన్నారు.
ఆర్మూర్ను అభివృద్ధి శిఖరంగా మార్చానని తన పనితీరును చూసి ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు నయవంచక దోపిడీ పార్టీలన్నారు. కాంగ్రెస్ అంటే కరువు, కష్టాలు, కన్నీళ్లని.. బీఆర్ఎస్ అంటే శాంతి, సంక్షేమం, తాగు,సాగు నీరన్నారు. ‘కారు’కు ఓటేస్తే సుపరిపాలన అని.. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ అదే నరకయాతన అన్నా రు. అభివృద్ధిలో నేడు తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని.. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన కేసీఆర్కే మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుక్కి సుజాతా సుధాకర్, ఉపసర్పంచ్ మణిగౌడ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, పీఏసీఎస్ వైస్చైర్మన్ రమేశ్, విండో చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ గంగారాం, వినోద్, నాయకులు రజనీష్, రంజిత్, సుధాకర్, చిన్నరావు, మల్లేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్బోర్డ్ కాలనీకి చెందిన మహిళలు, పద్మశాలీ, నాయీబ్రాహ్మణ సంఘం సభ్యు లు, ఆలూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన మాల సంఘం సభ్యులు, మాక్లూర్ మండలం కల్లె డ గ్రామానికి చెందిన గూండ్ల సంఘం సభ్యులు, మొటాడి రెడ్డి సంఘం, యాదవ సంఘం, గూండ్ల సంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు.