సదాశివనగర్, అక్టోబర్ 20: సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారని అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం నిర్వహించిన సదాశివనగర్, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. వారంటీ లేని పార్టీలు గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని, అలాంటి పార్టీలను ప్రజల నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాను ఎల్లప్పుడూ నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి కార్యకర్త ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. పూటకో మాట చెప్పే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. నియోజక వర్గంలో తాను చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తోందన్నారు.
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన 60 మంది మైనార్టీ యువకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహ్మద్ సాదిక్ అలీ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ షఫీయొద్దీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. సదాశివనగర్, కల్వరాల్, తుక్కోజివాడి, ఉత్తునూర్, లింగంపల్లి, కుప్రియాల్, రా మారెడ్డి, ఉప్పల్వాయి, గిద్ద, పోసానిపేట్ గ్రామాలకు చెందిన యువకులు పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సురేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రంగు రవీందర్ గౌడ్, ఎంపీపీలు అనసూయ, నారెడ్డి దశరథ్రెడ్డి, జడ్పీటీసీ నర్సింహులు, జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ నాయక్, అశోక్ రెడ్డి, పరమేశ్ గుప్తా, డోకురి రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, గడీల భాస్కర్, సాయాగౌడ్, భూంరెడ్డి, నారాయణరెడ్డి, రాజేశ్వర్ రావు, సాదక్అలీ, ఆకుల సిద్ధిరాములు, పైడి జనార్దన్, సర్పంచులు పాల్గొన్నారు.