ఖలీల్వాడి, అక్టోబర్ 10: నిజామాబాద్ నగరంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రతి మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి నిధు లు మంజూరు చేశానని గుర్తుచేశారు. రాజకీయంగా మున్నూరు కాపు లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు నిజామాబాద్ నగర అభివృద్ధి, మరోవైపు కులసంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తె లిపారు. తొమ్మిదేండ్లలో నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దామని అన్నారు.
హైదరాబాద్లో ఉన్న మహాప్రస్థానం కన్నా ధీటు గా నిజామాబాద్లో వైకుంఠధామాలు నిర్మించామని స్వయాన పుర పాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభినందించినట్లు గుర్తుచేశారు. హై దరాబాద్ తరహాలో నిజామాబాద్ నగరంలో మినీ ట్యాంక్బండ్ నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ మున్సిపల్ కార్యా లయాన్ని నిర్మించినట్లు వివరించారు. ప్రతి కాలనీ, ప్రతి వీధిలో డ్రైనేజీలు నిర్మించామని, నగరంలోని ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఆర్యూబీ నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని, విశాలమైన రోడ్లు, సెంటర్ మీడియన్ లైట్లు నగరం నలుదిక్కులా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చేందుకు టెండర్లు వేశామని ఎమ్మెల్యే బిగాల వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు, ఆడబిడ్డల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే రెట్టింపు ఉత్సా హంతో పనిచేస్తానని మాటి స్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ నాయకులు సూదం రవిచందర్, సి ర్ప రాజు, దారం సాయిలు, ము చ్కూర్ నవీన్, రామడుగు బాలకి షన్, కార్పొరేటర్లు ముచ్కూర్ లావ ణ్య, ఆకుల హేమతల, మాజీ కార్పొరేటర్ పుప్పాల విజయా భాజన్న, పంచరెడ్డి సూరి, గాండ్ల లింగం, ఎర్రం గంగాధర్, మల్కాయి మహేందర్, రంగు సీతారాం, పుప్పా ల రవి, పసుల సురేశ్, ఎట్టెం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.