టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. మూడు గంటలు చాలన్న కాంగ్రెస్కు ఇక మూడినట్లేనని మండిపడ్డారు. గుండారం రైతువేదికలో నిర్వహించిన రైతుసదస్సులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రామారెడ్డి మండలం కన్నాపూర్లో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ రూరల్, జూలై 20 : కాంగ్రెస్ను నమ్మితే గోస పడతామని.. మళ్లీ మూడు గంటల కరెంటే దిక్కవుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుండారం రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతు చర్చావేదికకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. రేవంత్రెడ్డి పీసీసీ పదవిని చంద్రబాబు నాయుడు పైసలతో కొనుక్కున్నాడన్నారు. చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండుగ అన్నట్టుగానే ఇప్పుడు ఆయన ఆత్మ రేవంత్ కూడా రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని అర్థం లేని వ్యాఖ్య లు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబును ఆనాడు రైతులు ఇంటికి సాగనంపారని, ఇప్పుడు కాంగ్రెస్కు కూడా అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు వ్యవసా యం చేస్తే అల్లికి అల్లి సున్నకు సున్నగా మిగిలి ందన్నారు. ఈ దరిద్రాన్ని పారదోలి వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆరేనని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న పథకాలతో దేశవ్యాప్తంగా మనం రోల్మోడల్గా నిలిచామని, ఈ సారి మళ్లీ కేసీఆర్ను గెలిపించుకుంటే ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలుస్తామన్నారు. మూడు పంటలు కావాల్నా… మూడు గంటలు కావాల్నా.. మత చిచ్చు పెట్టే మంటలు కావాల్నా.. అని ప్రశ్నించారు. తప్పుడు నినాదాలిచ్చి ప్రజలను మోసం చేసే ప్రతిపక్షాలకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని బాజిరెడ్డి అన్నారు. రేవంత్ ముక్కుపిండి రైతులకు క్షమాపణ చెప్పేదాక వదలొద్దు అని సూచించారు. ‘తల్లిదండ్రికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు తొడిగిస్తానన్నాడట. కాం గ్రెస్ నాలుగు వేల పింఛన్ అనే మాట అట్లనే ఉంది.
కేసీఆర్ను మనం కాపాడుకోవాలి.. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని’ పిలుపునిచ్చారు. కిరణ్రెడ్డి, రోశయ్యను సీఎంలుగా చూశాం. కిరణ్రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే చీకట్లేనని వెలుగే ఉండదని చెప్పాడు. అంతకుముందు సీఎం చంద్రబాబు వ్యవసాయమే దండగ అని చెప్పిండని.. ఆయనను రైతులు ఇంటికి సాగనంపారన్నారు. ప్రజలు తర్వాత రాజశేఖర్రెడ్డి 9 గంటల కరెంట్ ఇచ్చిండు. రాత్రి కరెంట్తో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్రావు, సొసైటీ చైర్మన్లు శ్రీధర్, జితేందర్, డీసీసీబీ డైరెక్టర్లు గోర్కంటి లింగన్న, చంద్రశేఖర్రెడ్డి, కార్పొరేటర్ లలితా గంగాధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావు, నాయకులు బాగారెడ్డి, ప్రేమ్దాస్, దేవన్న, ఉమాపతి, వెంకట్రెడ్డి, మోహన్, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, అశోక్, నవీన్, కొర్వ దేవేందర్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
రామారెడ్డి జూలై 20 : ఉచిత కరెంటు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. మండలంలోని కన్నాపూర్ గ్రామ రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అన్నదాతల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం కన్నాపూర్ వాగు అలుగు పారుతుండడంతో ఎమ్మెల్యే సందర్శించారు. త్వరలోనే బ్రిడ్జి విషయమై మంత్రి మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, ఎంపీపీ దశరథ్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ రవీందర్రావు, సర్పంచ్ రాజనర్సు, ఉప సర్పంచ్ అంజల్రెడ్డి, గిద్ద ఎంపీటీసీ ప్రవీణ్గౌడ్, నాయకులు రాజేందర్గౌడ్, మాలోత్ లింబాద్రి, పడిగెల శ్రీనివాస్, సర్మన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.