ఏర్గట్ల/ కమ్మర్పల్లి/ముప్కాల్, అక్టోబర్ 2: సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల రూపా యలతో పనిచేసిన.. సతాతో అడుగుతున్న.. తాను చేసిన అభివృ ద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సీఎం మంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. ఏర్గట్ల, కమ్మర్పల్లి, ముప్కాల్ మండలాల్లో రూ.50కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి వేముల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలో వెయ్యి కోట్ల నిధులతో రోడ్లను బా గు చేయించినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ మోసపు హామీలను నమ్మొద్దని కోరారు.
బీజేపీ ఎంపీ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశారని, ఐదేండ్లుగా మోసం చేసి మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి పసు పు బోర్డు అని మాయ మాటలు చెప్తున్నారన్నారు. ఐదేండ్లలో చే యని వారు ఇప్పుడు ఎన్నికల వేళ చేస్తామంటే రైతులు ఎలా న మ్ముతారని ప్రశ్నించారు. రైతులు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతదని ఓ పార్టీ వాళ్లు చెబుతున్నారని, మోటార్లకు మీటర్లు పెడతామని మరో పార్టీ నేతలు అంటున్నారన్నారు. 60ఏండ్లు పాలించిన ప్రతిపక్ష పార్టీలు రూ.2వేల పింఛన్ ఎందుకివ్వలేదని, ఇప్పుడు ఇస్తామంటున్నారంటే వారికి పదవికి కావాలి తప్ప సంక్షేమ పథకాలు వద్దని అర్థమవుతున్నదన్నారు. ప్రతిపక్షాలకు అధికారమిస్తే నిధుల కోసం ఢిల్లీ వెళ్తారని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి పనుల నిధులు మన దగ్గరే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ, రైతులు పోరాటం చేస్తే స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడొచ్చి పసుపు బోర్డు ను ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెబుతున్నారన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం ఇలా..
ఏర్గట్లలో.. తొర్తిలో రూ.8.15కోట్లతో బీటీ రోడ్డు, బట్టాపూర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన జీపీ, బట్టాపూర్ -గోదూర్ రోడ్డుపై రూ.10లక్షలతో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుమ్మిర్యాల్ గ్రామంలో గుమ్మిర్యాల్ నుంచి తాళ్లరాంపూర్ వరకు రూ.1.80 కోట్లతో రోడ్డు , గుమ్మిర్యాల్ – కొండాపూర్ రోడ్డుపై రూ.50 లక్షలతో స్లాబ్ కల్వర్టు పనులను ప్రారంభించారు. దోంచంద గ్రామంలో దోంచంద నుంచి తాళ్లరాంపూర్ వరకు రోడ్డు రెన్యువల్కు రూ.1.30 కోట్లతో శంకుస్థాపన, కమ్మర్పల్లి- తడ్పాకల్ మధ్య రోడ్డుపై తాళ్లరాంపూర్ వద్ద రూ.1.60కోట్లతో చేపట్టే మైనర్ బ్రిడ్జి, తాళ్లరాంపూర్ నుంచి వర్షకొండ వరకు రూ.4.45కోట్లతో రోడ్డు రెన్యువల్, తాళ్లరాంపూర్ నుంచి దోంచంద వరకు రూ.1.30కోట్లతో రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఏర్గట్లలో రూ.1.62కోట్లతో నాబార్డు గోదాం సీసీ ప్లాట్పామ్, సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణం, బట్టాపూర్ నుంచి గోదూర్కు వెళ్లేదారిలో ఏర్గట్ల వద్ద తీగల వాగుపై రూ.3.05కోట్లతో మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కమ్మర్పల్లిలో.. ఉప్లూర్ నుంచి జగిత్యాల జిల్లా డబ్బ గ్రామం వరకు రూ.1.45 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు రెన్యువల్, ఆర్.ఆర్.నగర్లో కాకతీయ కాలువ వద్ద రూ.1.12 కోట్లతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.
ముప్కాల్లో.. వేంపల్లిలో రూ.2.50 కోట్లతో కిసాన్నగర్ – రెంజర్ల రోడ్ వయా వేంపల్లి, రూ.20లక్షలతో హెల్త్ సబ్సెంటర్, రూ.5లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ , కొత్తపల్లిలో రూ.4.50 కోట్లతో కొత్తపల్లి-వన్నెల్(బీ) రోడ్డు, నాగంపేట్లో రూ.20లక్షలతో జీపీ భవనం, రూ.4.40 కోట్లతో బుస్సాపూర్-పెద్దవాగు రోడ్డు, రూ.2.23 కోట్లతో నాగంపేట-వెల్కటూర్ తండారోడ్డు, రూ.50లక్షలతో రెంజర్లలో స్లాబ్కల్వర్టు, వెంచిర్యాల్లో రూ.20 లక్షలతో జీపీ భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.