కమ్మర్పల్లి/వేల్పూర్, అక్టోబర్ 12 : రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తి వేముల మంజుల సురేందర్ రెడ్డి (77) హైదరాబాద్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం కన్ను మూశారు. ఏడాది కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పా టు ఆరోగ్యం బాగుపడినా మళ్లీ కొన్ని నెలల నుంచి ఆ రోగ్యం క్షీణించింది.అప్పటి నుంచి దవాఖానలోచికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో మం త్రి వేముల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం వేల్పూర్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంత్రి వేముల ఆయన సోదరుడు అజయ్ రెడ్డి, కు టుంబ సభ్యులను పలువురు ప్రముఖులు, నాయకు లు పరామర్శించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వే ల్పూర్లో మంత్రి నివాసానికి చేరుకుని మంత్రిని ఓదారుస్తున్నారు. తల్లి మృతితో మంత్రి వేముల ఆవేదనతో రోదిస్తుంటే కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మంత్రికి పలువురి పరామర్శ
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి, శాసన సభా కార్యదర్శి నరసింహాచారి పలువురు మంత్రిని పరామర్శించారు.
మాతృమూర్తి వియోగంతో బోరున విలపిస్తున్న మంత్రి
వేముల మంజులమ్మ తల్లిగా, ఇల్లాలిగా మరుపురాని ఆత్మీయతను, ప్రేమను, బాధ్యతను తన భర్త వేముల సురేందర్రెడ్డి, కుమారులు వేముల ప్రశాంత్ రెడ్డి, అజయ్రెడ్డి, కూతురు రాధికారెడ్డికి అందించారు. అదే ప్రేమను ఆమె తన కుటుంబం అంతటికి చివరికంట పంచారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు, సోదరి తల్లిచాటు బిడ్డలుగా ఎదిగారు మెదిలారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి దశాబ్దాల పాటు రైతు సేవలో, తొలి, మలిదశ ఉద్యమాల్లో, క్రియశీల నాయకత్వ రాజకీయాల్లో కొనసాగారు. భర్త రాజకీయ పయనం ఒకవైపు మరోవైపు చదువుల్లో ఉన్న పిల్లలు. ఇలాంటి ఇబ్బందుల్లో సైతం మంజులమ్మ తన భర్త రాజకీయ పయనాన్ని ప్రోత్సహించారు. మరోవైపు పిల్లల చదువు పట్ల ఆమె శ్రద్ధ చూపించారు. పెద్ద కొడుకు ప్రశాంత్ రెడ్డి సివిల్ ఇంజినీరింగ్ చదవడంలో, చిన్న కొడుకు అజయ్ రెడ్డి, కూతురు రాధికా రెడ్డి ప్రభుత్వోద్యోగులు కావడంలో తల్లిగా తన బాధ్యతను నెరవేర్చారు.