కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై నిజామాబాద్ కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం అధికారులతో సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైతే మరిన్ని గోదాములను గుర్తించాలన్నారు.
ఖలీల్వాడి, మే 11
ఖలీల్వాడి, మే 11 : రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయంపాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. అవసరమైతే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ మొత్తంలో గోడౌన్లను గుర్తించాలని, సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ స్థితిగతులపై గురువారం సమీక్షించారు. రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుం డా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంటనే తరలించడంతోపాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 218 రైస్మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం పంపిస్తున్నామని, వీటిలో 123 రా రైస్మిల్లులు ఉండగా ..95 బాయిల్డ్ రైస్మిల్లులకు ఇటీవల కురిసిన ధాన్యాన్ని పంపుతున్నామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మంత్రి వేముల దృష్టికి తెచ్చారు. గతేడాది 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం సేకరించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ప్రధానంగా రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు వెంటనే అన్లోడ్ జరగాలన్నారు. అన్లోడింగ్లో జాప్యంపై కారణాలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. రైస్మిల్లులను రాత్రివేళ ఆర్డీవోలు తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులకు గురి కాకూడదని, నిర్ణీత గడువులోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి.. సొసైటీ చైర్మన్లు, రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాల కాంట్రాక్టర్లను ఫోన్ ద్వారా సంప్రదించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కేటాయించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అదనంగా గోదాములు అవసరమని రైస్మిల్లర్లు తెలుపగా, ఈ మేరకు గోడౌన్లను తక్షణమే గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తుండడంతో నిర్దేశిత లక్ష్యానికనుగుణంగా సేకరణ ప్రక్రియ కొనసాగేందుకు సహకరించాలని రైస్మిల్లర్లకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీఎస్వో చంద్రప్రకాశ్, మెప్మా పీడీ రాములు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ జగదీశ్, డీసీవో సింహాచలం, డీటీసీ వెంకటరమణ, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వ్యవసా, మార్కెటింగ్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.