వేల్పూర్, మార్చి 6 : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మహిళ కేంద్రంగానే అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ఫంక్షన్హాల్లో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వేముల హాజరుకాగా, బాల్కొండ నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, వీవోఏలు, సీసీలు, ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సేవలు, పనితీరును అభినందించారు. మంత్రి తన సొంత ఖర్చులతో సుమారు వెయ్యి మందికి చీరలను పంపిణీ చేశారు. సతీసమేతంగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి మాట్లాడారు. మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్లా ప్రపంచంలోనే మరెవరూ ఆలోచన చేయలేదని అన్నా రు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్తో మొదలు.. వృద్ధాప్యంలో ఆసరా పెన్షన్ వరకు ఎన్నో మానవీయకోణ కార్యక్రమాలు నేడు కేసీఆర్ నా యకత్వంలో అమలవుతున్నాయని వివరించారు.
బాల్కొండ నియోజకవర్గంలో వేలాదిమందికి లబ్ధి
ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ప్రతినెలా 28 వేల మంది బీడీ కార్మికులకు రూ.5.65 కోట్లు, 2016 మంది ఒంటరి మహిళలకు రూ. 4.65 లక్షలు, 12, 765 మంది వితంతువులకు రూ. 2.57 కోట్లు, 4,242 మందికి వృద్ధాప్య పెన్షన్లకు రూ. 85 లక్షలు, 10 వేల మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద రూ. 100 కోట్లు, కేసీఆర్ కిట్ కింద రూ.12 వేల చొప్పున ఇప్పటివరకు నేరుగా బాల్కొండ నియోజకవర్గ మహిళలకు రూ.950 కోట్ల లబ్ధి జరిగినట్లు తెలిపారు. ఇవేగాకుండా 19 నూతన అంగన్వాడీ భవనాలు, రూ.3 కోట్లతో 52 మహిళా సంఘ భవనాలు నిర్మించినట్లు చెప్పారు. గతంలో అంగన్వాడీలకు జీతం రూ. 4500 ఉండగా రూ. 10,500 వరకు చేసి, మళ్లీ 13,650 పెంచారని తెలిపారు. ఆశ కార్యకర్తలకు రూ.1500 ఉండగా రూ. 9,750 వరకు హోంగార్డులకు రూ. 12 వేల నుంచి రూ.30 వేలు, వీవోఏలకు రూ.2 వేల నుంచి రూ. 5,900, అంగన్వాడీ హెల్పర్స్కు రూ.4,500 ఉండగా 7,500 వరకు పెంచారన్నారు. 2014 నుంచి మహిళా సంఘాల్లోని ఆరు వేల గ్రూపులకు సుమారు రూ. వెయ్యి కోట్లు ఇవ్వగా.. ఈ ఒక్క సంవత్సరంలోనే రూ. 281 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు.
ఒక్కో గ్రూప్కు రుణపరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో ఆ ప్రాంతం సుభిక్షంగాఉంటుందని సీఎం కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారని తెలిపారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతారో, గౌరవించబడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని పేర్కొన్నారు. మహిళలు అనుకుంటే సా ధ్యం కానిదంటూ ఏదీ లేదని, వారికి కావాల్సింది ప్రోత్సాహమన్నారు. కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.