కోటగిరి ఫిబ్రవరి 26 : జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. కోటగిరిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల అరెస్టు.. విడుదల
కోటగిరి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఎజాజ్ఖాన్, పత్తి లక్ష్మణ్ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయాలనే ఆలోచనలో ఉండగా, అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు.