మెండోరా, ఫిబ్రవరి 15 : తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, మద్దతు ధర ఇప్పిస్తానని గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్..పసుపు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పత్తా లేకుండా పోయాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రజలు ఒకసారి ఆయన మాటలకు మోసపోయారని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో పల్లెల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. బుధవారం ఆయన మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సోన్పేట్ గ్రామంలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్సెంటర్, రూ.14 లక్షలతో హనుమాన్ దేవాలయం సాలాహారం, ఆర్చిగేట్ పనులు, దూద్గాంలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్సెంటర్, రెడ్డి కమ్యూనిటీ హాల్, నెహ్రూనగర్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న జీపీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. సావెల్, ఎల్కటూర్, నడిమితండా గ్రామాల్లో రూ.20 లక్షలతో నూతన సబ్సెంటర్లు, నూతన జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో కులసంఘ భవనాలు కావాలని విజ్ఞప్తులు రాగా, వాటి నిర్మాణానికి కూడా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తుంటే.. కొందరు దేవుళ్లు, కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కోరారు. ఈ మధ్యే గ్రామాల్లో తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఎవరు మంచి చేస్తున్నారో లేదో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యే కాక ముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా 13 హెల్త్ సబ్సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 20లక్షల చొప్పున నియోజకవర్గంలో మొత్తం 29 జీపీ భవనాలకు నిధులు మంజూరైనట్లు చెప్పారు. గ్రా మాల్లో రూ. వందల కోట్ల తో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు.
చిన్నారులకు ఆత్మీయ పలకరింపు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతి గ్రామంలో చిన్నారులు, వృద్ధులను ఆప్యాయంగా పలుకరించారు. అంగన్వాడీ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా మా ట్లాడి మిఠాయిలను పంచిపెట్టా రు. కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, జడ్పీటీసీ తలారి గంగాధర్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, వేల్పూర్ ఏఎంసీ చైర్పర్సన్ అరుణా నవీన్గౌడ్, డీఎంహెచ్వో సుదర్శనం, డీఎల్పీవో శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సరస్వతీ రవిగౌడ్, సర్పంచులు గోలి ప్రకాశ్, అనసూయా మహేందర్, పసుల సుజాతా శ్రీనివాస్, నేల్ల లావణ్యా లింగన్న, సామ గంగారెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీ దేవేందర్, ఉపసర్పంచులు సంధ్య, దూద్గాం శ్రీనివాస్, నేల్ల పోశెట్టి, విద్యాసాగర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మంత్రి వేముల సమక్షంలో బీఎస్పీ నాయకుల చేరిక
నల్లూర్గ్రామంలోని బీఎస్పీకి చెందిన నాయకులు సాయికుమార్, మహేశ్ ఆధ్వర్యం లో 30 మంది యువకులు బుధవారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ సామ పద్మ, నల్లూర్ ఎంపీటీసీ సత్యనారాయణ, వార్డు సభ్యులు నవీన్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.