నందిపేట్/ఆర్మూర్, నవంబర్ 9: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, అల్లాటప్పా నాయకులతో కుదరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఒక్క కేసీఆర్ కోసం ఢిల్లీ నుంచి గుంపులుగా వస్తున్నారని విమర్శించారు. బీజేపీ తరఫున మోదీ, అమిత్షా, 15మంది సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ వాళ్లు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ఇలా ఎందరో ఒక్క కేసీఆర్ను ఎదుర్కొనేందుకు వస్తున్నారన్నారు. అయినా తాము భయపడేది లేదని, రెండుసార్లు ఒంటరిగానే ఎదుర్కొన్నాం.. ఇప్పుడు కూడా సింగిల్గానే ముందుకు పోతామని, సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్రెడ్డి నామినేషన్ దాఖల కార్యక్రమం గురువారం నిర్వహించగా, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీ వాళ్లకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయని, వాటితో మాయమాటలు చెప్పి ఓట్ల కోసం కుట్రలు చేయనున్నారని, ప్రజలు ఓట్లతోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయంలో ఆర్మూర్ ప్రాంతం అద్భుతం, ఎన్నో ప్రాంతాల్లో ఇక్కడి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి ఈ ప్రాంతం పెట్టింది పేరని కేటీఆర్ తెలిపారు. 28 రాష్ర్టాల్లో ఎక్కడా లేని పథకాలు రైతుల కోసం తెలంగాణలో ఉన్నాయని, రెండుసార్లు గెలిపించుకొని జోడెడ్ల మాదిరిగా అభివృద్ధి, సంక్షేమం జోరుగా సాగుతుందన్నారు. ప్రతి ఆడబిడ్డకూ సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ. 3వేలు, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా, రూ.400కే సిలిండర్, రూ.16వేలకు పెట్టుబడి సాయం పెంపు, ఆసరా పింఛన్లను పెంచుతామని పేర్కొన్నారు. ప్రతి నెలా అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. కరెంటు, తాగు, సాగునీటి సరఫరా ఎంతో మెరుగయ్యిందని, పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని, తాను చెప్పిన పథకాలన్నీ అమలు కావడానికి అల్లాటప్పా నాయకులు వస్తే కుదరదన్నారు. 50 ఏండ్లు అధికారంలో ఉండి కరెంటు, సాగునీరు ఇవ్వకుండా గోసపెట్టిన వాళ్లు ఇప్పుడొచ్చి మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దన్నారు. కరెంటు కావాల్న, కాంగ్రెస్ కావాల్న ఒక్కసారి ఆలోచించాలని వివరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్రెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు, కిందిస్థాయి నుంచి.. మీ అందరిలోంచి వచ్చి రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఆర్మూర్కు సేవ చేస్తున్నాడని మంత్రి కేటీఆర్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించారని, ప్రస్తుతం 60వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేఆశన్నగారి జీవన్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావ్, రాజారాం యాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జీవన్రెడ్డి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఆర్మూర్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయి తే… ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అ ని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ తనను తండ్రిలా ముందుకు నడిపిస్తున్నారని , కేటీఆర్ పెద్దన్నలా నా భుజం తట్టి అండగా నిలుస్తున్నారని, కవితక్క తనను సొంత తమ్ముడిలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు.