నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 24 : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేట్ కట్ చేశారు. నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక వికలాంగ పిల్లలతో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొని కేక్ కట్ చేశారు. నగరంలోని చంద్రశేఖర్కాలనీలో కేటీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక కంపెనీలు తీసుకవచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని యూనియన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. రుద్రూర్లోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు.
డిచ్పల్లి సీహెచ్సీ దవాఖాన వదద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నల్ల సారికా హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రూరల్ మండలంలోని మల్లారంలో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో పూజలు చేసి భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. సిరికొండలోని ఆశ్రమ పాఠశాలలో నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఇందల్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమేశ్నాయక్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మోపాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జక్రాన్పల్లిలో ఎంపీపీ కుంచాల విమలా రాజు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రం కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థుల మధ్య బీఆర్ఎస్ నాయకులు కేక్కట్ చేసి పంపిణీ చేశారు.
మోర్తాడ్లోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో కేక్కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. వేల్పూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించుకున్నారు.మాక్లూర్ మండలంలోని మెట్టు, వెంకటాపూర్ గ్రామాల్లోని చర్చి, హనుమాన్ ఆలయాల్లో కేక్ కట్ చేశారు. గ్రామంలో మొక్కలు నాటారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. ఎడపల్లిలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నంది గుడిలో పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు.