పిట్లం/బిచ్కుంద/మద్నూర్, డిసెంబర్ 2: జుక్కల్ నియోజకవర్గాని కి రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శనివారం రానున్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటన కోసం ఏర్పాట్లను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పిట్లం మండలకేంద్రంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయాలను మంత్రి ప్రారంభించనున్నారు.
ఈమేరకు అక్కడ అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలను కోరారు. ఆయన వెంట పిట్లం ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీబాయి బాబూసింగ్, సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, జొన్న శ్రీనివాస్రెడ్డి, విజయ్, నర్సాగౌడ్, జగదీశ్, మహిపాల్గౌడ్, రహిమతుల్లా తదితరులు పాల్గొన్నారు. బిచ్కుందలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారు. మంత్రికి కందర్పల్లి చౌరస్తా నుంచి ఘన స్వాగతం పలుకుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు బిచ్కుంద ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, బిచ్కుంద ఉపసర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు వెంకట్రావు తదితరులు ఉన్నారు.
డోంగ్లీ మండలాన్ని మంత్రి హరీశ్రావు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తారు. ఇందుకోసం సభాస్థలితోపాటు ప్రభుత్వ కార్యాలయాలను ఎమ్మెల్యే షిండే పరిశీలించారు. సభకు వచ్చే ప్రజల కోసం ఏర్పాట్లు, భోజన వసతికి సంబంధించి స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ రాంపటేల్, తహసీల్దార్ అనిల్, నాయకులు అశోక్పటేల్, శశాంక్ పటేల్, దీన్దయాల్, విలాస్, గఫార్, ఆనంద్ పటేల్, కృష్ణాగౌడ్ తదితరులు ఉన్నారు.