భీమ్గల్, డిసెంబర్ 6: బాల్కొండ నియోజకవర్గంలోని కిడ్నీ బాధిత ప్రజల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజలు డయాలసిస్ చేయించుకునేందుకు నిజామాబాద్, హైదరాబాద్ నగరాల్లోని దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని మంత్రి వేముల వివరించారు. మంత్రి హరీశ్రావు మంగళవారం వేల్పూర్కు వచ్చిన సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీమ్గల్ కేంద్రంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్ రావు రెండు రోజుల్లోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తంచేస్తూ నియోజకవర్గ ప్రజలపక్షాన ఆరోగ్యశాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఉన్నారు.
వేల్పూర్, డిసెంబర్ 6: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో వేల్పూర్లో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమావేశమయ్యారు. జగిత్యాల బహిరంగ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి తరలిరానున్న జన సమీకరణపై ఈ సందర్భంగా చర్చించారు. అంతకుముందు వేల్పూర్కు చేరుకున్న మంత్రి హరీశ్రావుకు మంత్రి వేముల ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీ గౌడ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.