వేల్పూర్/ఆర్మూర్/మాక్లూర్/బోధన్ రూరల్/పిట్లం/ ఎల్లారెడ్డి, నవంబర్ 5 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలతోపాటు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధికి ఆకర్షితులపై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అంక్సాపూర్ బీజేపీ ఎంపీటీసీ పడిగెల రవి, భీమ్గల్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు మహేశ్తోపాటు వారి అనుచరలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, దేవాదాయ శాఖ మాజీ చైర్మన్ ఇప్ప గంగారెడ్డి, తాళ్లరాంపూర్ సొసైటీ డైరెక్టర్ సాయిరాం, బీజేపీ సీనియర్ నాయకుడు చిన్నుల శ్రీధర్, దాసరి సాగర్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గుంటి బెనర్జీ, కోశాధికారి సుంకె విక్రమ్, నాయకులు దూమాల శేఖర్, మాకూరి వంశీ, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన ముస్లిం మైనారిటీ యువకులు, వాడి గ్రామానికి చెందిన బీజేపీ యువకులు, బెజ్జోరా గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు జుబేర్ చౌహు గులాబీ పార్టీలో చేరారు. వందల సంఖ్యలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం వడ్యాట్పల్లి గ్రామానికి చెందిన జై భీం యూత్ సభ్యులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బడుగు సత్యం ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుత్ప తండా సర్పంచ్ జ్యోతీమోహన్, డొంకేశ్వర్ మండలం కోమట్పల్లి గ్రామానికి చెందిన ఎల్లన్న ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జీవన్రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, నాయకులు సుమీర్ హైమద్, భూషణ్, నిమ్మల ఒడ్డెన్న, చిరంజీవి, పాషా, సాయికుమార్, మధుసూదన్, ప్రమోద్, నవీన్, భార్గవ్ పాల్గొన్నారు.
బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం సాలూరాక్యాంప్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ షకీల్, దమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, గోద్మేగాం గ్రామానికి చెందిన పది మంది బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే.. బీఆర్ఎస్లో చేరినవారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే సురేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు జలేంధర్రెడ్డి, సతీశ్, నర్సిహులలు తదితరులు పాల్గొన్నారు.