ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు కుటుంబసమేతంగా చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాలు సందడిగా మారాయి. పాస్టర్లు.. ఏసు జన్మ వృత్తాంతం, క్రీస్తు సందేశాన్ని భక్తులకు వినిపించారు. ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 25