శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోడీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడలోబుధవారం నిర్వహించిన మెగా జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గానికి చెందిన యువతీయువకులు పెద్ద సంఖ్య తరలివచ్చారు. స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్మేళాను ప్రారంభించారు. 70కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. సుమారు 4వేల మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 1,411మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పర్యవేక్షణలో బుధవారం బాన్సువాడలో నిర్వహించిన మెగా జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఉద్యోగాల కోసం నియోజకవర్గానికి చెందిన యువతీయువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఎస్ఎంబీ ఫంక్షన్హాల్ మొత్తం కిటకిటలాడింది. అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు 70కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు జాబ్మేళాలో పాల్గొన్నాయి. సుమారు 4వేల మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 1411 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన వారికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి నియామకపత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి జాబ్మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయం. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. జాబ్మేళాలో పాల్గొని మూడు కంపెనీల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొన్నాను.
– వేద సాహితి, బాన్సువాడ.
పీబీఆర్ జాబ్మేళాలో పాల్గొని వివిధ కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. రూ.18వేల నుంచి 20వేల వరకు వేతనం అందించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. జాబ్మేళాతో నా లాంటి ఎంతో మంది నిరుద్యోగులకు మేలు చేకూరింది. జాబ్మేళాను ఏర్పాటు చేసిన స్పీకర్ సార్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
– రేవతి, నస్రుల్లాబాద్.
డిగ్రీ వరకు చదువుకున్న నేను ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో పీబీఆర్ జాబ్మేళాను ఏర్పాటు చేశారు. జాబ్మేళాలో వివిధ కంపెనీల వారికి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి భారీ పోటీ ఉన్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జాబ్మేళాకు నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో ఎక్కడ జాబ్ ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.
– సావిత్రి, కొయ్యగుట్ట
చదువు పూర్తవుతున్నది, ఎలా ముందుకెళ్లాలనే భయంతో ఉన్న నాకు పీబీఆర్ మెగా జాబ్మేళా కొత్త ఆలోచనను రేకెత్తించింది. జాతీయస్థాయిలో సుమారు 70 కంపెనీలకు చెందిన ప్రతినిధులు బాన్సువాడకు వచ్చి, ఉద్యోగాలకు ఎంపిక చేయడం బాగున్నది. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తున్న స్పీకర్ పోచారం కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం.
లాట్ మొబైల్ షోరూంలో మేనేజర్గా..
పీబీఆర్ (పోచారం భాస్కర్రెడ్డి) జాబ్మేళాను ఏర్పాటు చేయడం నాలాంటి ఎందరో నిరుద్యోగులకు వరం. ఎంబీఏ పూర్తిచేశాను. పీబీఆర్ జాబ్మేళాలో లాట్ మొబైల్ షోరూం ఇంటర్వ్యూలో పాల్గొని మేనేజర్గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉన్నది. రూ.25వేల వేతనంతో ఉద్యోగ నియామకపత్రాన్ని అందుకున్నాను.
– కొండ సాయికుమార్, బోర్లం క్యాంపు