ఆర్మూర్: రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన స్వగ్రామమైన అంకాపూర్లో గంగారెడ్డి (పేట గంగారెడ్డి) పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి గంగారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడేనుమోశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ ఎంపీపీలు పస్క నర్సయ్య, వాకిడి సంతోష్రెడ్డి, మాస్త ప్రభాకర్, ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సొసైటీ చైర్మన్లు సోమ హేమంత్రెడ్డి, గడ్డం శ్రావణ్రెడ్డి, కాపెల్లి చిన్న ముత్తెన్న, కల్లెం భోజారెడ్డి, ఆర్మూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, ఎంపీడీవో గోపిబాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అన్ని పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.