కామారెడ్డి, ఏప్రిల్ 1 : విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. బడిలో ఆహ్లాదకర వాతావరణం, వనరులు, వసతులు, ఆకర్షణీయమైన భవనాలు, తరగతి గదులను నిర్మించేలా మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బడిలో ఆహ్లాదకర వాతావరణం, వనరులు, వసతులు, ఆకర్షణీయమైన భవనాలు, తరగతి గదు లు విద్యార్థులను పాఠశాలల వైపు నడిపిస్తాయి. పాఠశాలలో అన్ని వసతులు ఉండి, వాటిని సిబ్బం ది, విద్యార్థులు వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదం చేస్తాయి, పాఠశాల విద్యలో ప్రగతిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి, మన ఊరు- మనబస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది. పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశమై అవసరాలను అంచనా వేయాలి. ఎంపిక చేసిన అంశాలతో పాటు నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంటగది, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలలో ప్రాధాన్య అంశాలు సరిచూసుకోవాలి. చేపట్టాల్సిన పనులను గుర్తించి తీర్మానం చేయాలి. ఫీల్డ్ ఇంజినీర్ పాఠశాల నిర్వహణ కమిటీతో చర్చించి ప్రధాన వసతులను గుర్తించి అంచనాలను రూపొందించాలి. పరిపాలనా అనుమతులను కలెక్టర్ ఆమోదిస్తారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఈఈ, రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఈఈ, రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ఎస్ఈ, రూ.2కోట్లపైన సీఈ పరిధిలో సాంకేతిక అనుమతులు పొందాల్సి ఉంటుంది.
కామారెడ్డి జిల్లాలో 1011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు187, ప్రాథమికోన్నత పాఠశాలలు 127, ప్రాథమిక పాఠశాలలు 697 ఉన్నాయి. ఇందులో 94,698 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మన ఊరు-మన బడిలో ఎంపిక చేసిన పాఠశాల లు ప్రత్యేకంగా రెండు బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒకటి పాఠశాల పనుల నిర్వహణకు అవసరమయ్యే ఖర్చుల కోసం, రెండోది దాతలు, పూర్వ విద్యార్థుల విరాళాల నిర్వహణకు వినియోగించాలి. నిధుల విడుదలకు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఫీల్డ్ ఇంజినీర్ చెక్కులపై సంతకాలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, ఫీల్డ్ ఇంజినీర్తో పాటు చైర్మన్, కమిషనర్లు సంతకాలు చేయాలి. ఆర్సీసీ నిర్మాణంతో నీటి సరఫరా కలిగిన నాలుగు ఐడబ్ల్యూసీ (ఇండియా వాటర్ క్లోసెట్) గదులు గల మరుగుదొడ్లు నిర్మించనున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్లు-2, ఆర్సీసీతో నీరు నిల్వ చేయడానికి ట్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నారు. 20 మంది విద్యార్థులకు ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నారు. ప్రతి తరగతి గదిలో నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడీ ట్యూబ్లైట్లు అమర్చనున్నారు. పాఠశాలలో విద్యుత్ వైరింగ్, స్విచ్ బోర్డులు, సాకెట్లు, డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, వీధి దీపాలు సమకూర్చనున్నారు. నీటి ట్యాంక్కు మిషన్ భగీరథ నుంచి కనెక్షన్ ఇవ్వనున్నారు.
పాఠశాలలకు ఎనామిల్పెయింట్ వేయనున్నారు. తరగతి గదులు, కారిడార్, ఆవరణ, ప్రహరీ, గోడమెట్లు, ప్లాట్ఫాం, ప్లే గ్రౌండ్, ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న గోడలపై లర్నింగ్ ఎయిడ్ అనే కా న్సెప్ట్ ద్వారా చిత్రాలు వేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నూతన తరగతి గదులను ఆర్సీసీతో నిర్మాణం పూర్తి చేయనున్నారు.
ప్రాథమిక పాఠశాలలో తరగతి గది 10 ఫీట్ల వెడల్పు గల కారిడార్తో పాటు 30 మంది విద్యార్థులకు సరిపోయేలా నిర్మించనున్నారు. ఉన్నత పాఠశాలకు 6 ఫీట్ల వెడల్పు కలిగిన కారిడార్తో పాటు 40 మంది విద్యార్థులకు సరిపోయేలా గది నిర్మించనున్నారు. ప్రహరీని ఆర్సీసీ కాలమ్స్ పునాది కలిగి ఉండేలా నిర్మించనున్నారు. 9 ఇంచుల మందం గల ఇటుక గోడ, 1.5 మీటర్ల ఎత్తు, ప్లాస్టరింగ్, పెయింటింగ్తో నిర్మాణం చేయనున్నారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోజనశాల ఏర్పాటు చేయనున్నారు.