ఆర్మూర్, మే 30: పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపైన ఉన్న శివాలయం వద్ద ప్రతి సోమవారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో మండలంలోని మంథని గ్రామస్తులు సేవలు అందించారు. పల్లకీసేవ నిర్వహించారు. అంతకుముందు ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, మహిళ కౌన్సిలర్లు రింగుల భారతీ భూషణ్, రేవతీ గంగామోహన్, ఎస్ఆర్.సుజాతా రమేశ్, సుంకరి ఈశ్వరీ రంగన్న పూజలు నిర్వహించారు.
అమావాస్యను పురస్కరించుకుని సిద్ధుల గుట్టపై 108 మంది దంపతులతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మూడు వేల పైచిలుకు భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సిద్ధుల గుట్ట చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్రెడ్డి, మంథని అజయ్ పాల్గొన్నారు.
చక్రేశ్వర శివాలయంలో..
శక్కర్నగర్, మే 29: పట్టణంలోని చక్రేశ్వర శివమందిరంలో సోమావతి అమావాస్య సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుంచి ఆలయంలో పూజారులు గణేశ్ శర్మ, మహేశ్పాఠక్, శివకుమార్ పూజలు జరిపించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రాంరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రాములు, ఆలయ కమిటీ చైర్మన్ సింగం భరత్ యాదవ్, డైరెక్టర్లు పర్యవేక్షించారు.