ఖలీల్వాడి, ఏప్రిల్ 25: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ నియోజకవర్గానికి మొత్తం 42 మంది 90 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగు సెట్లు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నాలుగు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు. నేడు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 29 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదేరోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయను న్నారు. పోలింగ్ మే 13న, కౌంటింగ్ జూన్ 4న చేపట్టనున్నారు.