బోధన్, ఫిబ్రవరి 26: పట్టణంలో బోధన్ – జాన్కంపేట్ రైల్వేలైన్లో గాంధీ పార్కు వద్ద ఉన్న రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొని, పనులకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్వోబీని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు వారు సూచించారు. కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
బోధన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపనకు వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులకు కనీసం కుర్చీలు ఏర్పాటుచేయకపోవడమేకాకుండా, అమర్యాదకరంగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టుల బహిష్కరించారు. అనంతరం రైల్వే క్రాసింగ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.