నిజామాబాద్ రూరల్/కోటగిరి/మోస్రా (చందూర్), నవంబర్ 24 : నిజామాబాద్ రూరల్ మండలంలో మల్కాపూర్ తండాలో పోడు సర్వేపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్దాస్ మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గ్రామానికి చెందిన 318 మంది పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు సర్వే పూర్తిచేశారని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ అనిల్కుమార్, ఎస్హెచ్వో లింబాద్రి, సర్వేయర్ ప్రణీత, గిర్దావర్ హరీశ్రెడ్డి, ఏఈవో రమాకాంత్, జీపీ కార్యదర్శి సంతోష్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్దాస్, గోపాల్, ప్రకాశ్నాయక్, గులాబ్సింగ్ పాల్గొన్నారు.
కోటగిరి మండలంలోని కొత్తపల్లి, సుద్దులంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోడు వ్యవసాయం చేసిన రైతులకు పట్టాలను అందజేస్తామని తెలిపారు. ఎస్సై మశ్చేందర్రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మోస్రా మండలంలోని చింతకుంటలో తహసీల్దార్ సాయిలు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సర్వే వివరాలను వెల్లడించారు. సర్పంచ్ విమలా లింగయ్య, సర్వేయర్ మల్లికార్జున్, ఏవో ప్రశాంత్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.