రెంజల్, ఫిబ్రవరి 23: కందకుర్తిలో సాధు సంతులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలం, మూడు నదులు కలిసే త్రివేణి సంగమ విశిష్టతను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని నాందేడ్ రాజసభ సభ్యుడు డాక్టర్ అజిత్గోప్చడే అన్నారు. కందకుర్తి గ్రామంలో ఆర్ఎస్ఎస్ వ్యవప్థాపకుడు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ జన్మస్థలాన్ని శుక్రవారం రాజసభ సభ్యుడు అజిత్గోప్చడే, ఆయన సతీమణి చేతనతో కలిసి సందర్శించి పూజలు నిర్వహించారు.
సీతారాం సంత్ ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ… హెడ్గేవార్ జన్మ స్థలాన్ని దర్శించుకున్నాకే రాజకీయ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట సీతారాం త్యాగి మహరాజ్, కేశవ సేవాసమితి సభ్యులు అంకు మహేశ్, హన్మంతురావు తదితరులు ఉన్నారు.