నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 10;పల్లె.. ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. పట్టణాలు కూడా వేగంగా పురోగమిస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం మెరుగు పడింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా పచ్చదనం విచ్చుకుంది. మొత్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో హుషారుగా సాగుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్రావు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఇందులో భాగంగా చేపడుతున్న అభివృద్ధి, కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొన్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు.