బాన్సువాడ టౌన్/విద్యానగర్/ఎల్లారెడ్డి రూరల్, జనవరి 26 : బాన్సువాడలోని శ్రీజ్ఞానసరస్వతీ మాత ఆలయంలో వసంత పంచమిని భక్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి సతీసమేతంగా కుటుంబంతో కలిసి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, మండల నాయకులు దొడ్ల మహేందర్రెడ్డి, శేఖర్ రెడ్డి, సరస్వతీ మాత మాలధారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శారదా దేవి ఆలయంలో గురువారం వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో వసంత పంచమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి రోజున అయ్యప్పస్వామి, సాయిబాబా, మౌలాన్ఖేడ్ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాల వార్షికోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్పస్వామి ఆలయంలో పూజారి శ్రీనివాస్రావు, గురుస్వామి చంద్రం, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మాజీ సర్పంచ్ చెన్నలక్ష్మణ్దంపతులు, భక్తులు పడిగెల హరిప్రసాద్, పప్పు వెంకటేశం, రాజేందర్రావ్, ప్రభాకర్ తదితరులున్నారు. సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు జనార్దన్గౌడ్, ముత్యపు వీరేశలింగం, మహిపాల్ రెడ్డి, పూజారులు విజయ్ పంతులు, శివకుమార్ శర్మ, కృష్ణశర్మ, అనూజ్ శర్మ తదితరులున్నారు. ఎల్లారెడ్డి శివారులో ఉన్న మౌలాన్ఖేడ్ వీరభద్రస్వామి ఆలయంలో గురువారం 18వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు సంగప్ప సోదరులతోపాటు మడుపతి శివకుమార్ అప్ప, గురుస్వామి హనుమంతప్ప, మాజీ వైస్ ఎంపీపీ చెన్న సతీశ్, శివ దీక్షాధారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.