Machareddy | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో శ్రీలక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉదారత చూపింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆమా రాజవ్వ ఏంగులు మనమరాలు వివాహానికి ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నరసింహారెడ్డి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద అమ్మాయికి పుస్తె మట్టెలు అందజేసిన నరసింహారెడ్డికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీ మల్లారెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్, రమేశ్బాబు, చంద్రయ్య, శ్రీకాంత్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.