‘మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సతీ సహగమనం నిర్మూలనకు కృషిచేసిన సామాజిక సేవకురాలు సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలువురు మహిళా ఉపాధ్యాయురాళ్లను సన్మానించారు.
నిజాంసాగర్ ఉన్నత పాఠశాల ఆవరణలో సావిత్రీబాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు శైలజ, సంఘమిత్రను సన్మానించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి అమర్సింగ్, నిజాంసాగర్, అచ్చంపేట ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, వేణుగోపాల్రావు, ఉపాధ్యాయులు నాగవేందర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
పిట్లంలోని శివాజీ చౌరస్తా వద్ద ఫూలే చిత్రపటానికి యువకులు, బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో లోక మనోహర్, కుమ్మరి యాదగిరి, అశోక్రాజ్, లక్ష్మణ్ యాదవ్, శంకర్, సాయిలు, దయానంద్, శేఖర్, శివకుమార్, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని రచయిత, బహుజన నాయకుడు రవీందర్ మాట్లాడుతూ.. ఫూలే ఆలోచనలు గొప్పవని అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయురాళ్లను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ దరాస్ సురేశ్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్, ఎంఈవో రాములు, ఉప సర్పంచ్ విఠల్, ఎంపీటీసీలు సంగీత, అనూషబాయి, సాయిలు, వార్డు సభ్యురాలు లత, నాయకులు కుశాల్, హన్మంత్, పీఆర్టీయూ నాయకులు సునీల్, మారుతి, శివరాం, జ్యోతి, శివప్రభ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల శంకర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవీ బాల్రాజ్గౌడ్, సంఘం సభ్యుడు కురుమ సాయిబాబా, అంబేద్కర్ సంఘం ఎల్లారెడ్డి డివిజన్ ఇన్చార్జి బిట్ల సురేందర్, కన్నీరాం, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, రాజీవ్కుమార్, అఖిల్రావు, వెంకటయ్య, నాగం గోపీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
గాంధారి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం తదితరులు సావిత్రీ బాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీశ్, ఎంపీవో రాజ్కిరణ్రెడ్డి, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, ఏపీవో హరిబాబు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తాఫా, నేరల్తండా ఉప సర్పంచ్ నర్సింగ్, సీనియర్ అసిస్టెంట్ బక్తీయారుద్దీన్, దేవరావు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రకాశ్, వెంకటేశ్వర్గౌడ్, లక్ష్మణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గాంధారిలోని విజేత పబ్లిక్ స్కూల్, తిప్పారం తండాలో ఫూలే జయంతిని నిర్వహించారు.
లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, సజ్జన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సావిత్రీబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సజ్జన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పద్మను సన్మానించారు. ఉపాధ్యాయులు బాల్రెడ్డి, బన్సీ, జాకీర్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడిలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి పూలమాల వేశారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మాజివాడి మాజీ సర్పంచ్ ఎర్రవాటి లింగారెడ్డి, నవీన్, జంగం ప్రభుస్వామి, ఆస సురేశ్, కోరి బాల్రాజు, భూపెల్లి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్, నందివాడ, తాడ్వాయి, దేమికలాన్, చిట్యాల గ్రామాల్లో సావిత్రీబాయి ఫూలే విగ్రహాలు, చిత్ర పటాలను పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నందివాడ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో రాజ్వీర్, తహసీల్దార్ వెంకటేశ్, ఎస్సై ఆంజనేయులుకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పోచయ్య, కార్యదర్శి గణేశ్, సభ్యులు స్వామి, కాన్షీరాం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న సావిత్రీబాయి పూలే విగ్రహానికి టీఎన్జీవోస్, బీఆర్ఎస్ యువజన నాయకులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి విభాగం, జిల్లా గ్రంథాలయంలో పూలే చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యదర్శి సాయిలు, సహాధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షుడు చక్రధర్, సాయిలు, ఆయా సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలోని బీసీ బాలుర వసతిగృహంలో బీసీ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు వనం గంగాధర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి దత్తు, నాయకులు విజయ్, మహేశ్, జీవన్, సురేశ్, హన్మాండ్లు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలం దామరంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు రవీంధ్రనాథ్ ఆర్య, చంద్రశేఖర్, హన్మాండ్లు, శివలాల్, గాయత్రీ, మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు. బీబీపేట్లోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, ఎంపీపీ బాలామణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆలిండియా అంబేద్కర్ సంఘం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
మాచారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1, 2 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రీబాయి చిత్ర పటానికి కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు నవీన్, సుదర్శన్, జబీఉల్లా తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట్ మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యాంరావు, ఉపాధ్యాయులు అనురాధ, ఆంజనేయప్రసాద్, విద్యా వలంటీర్లు మాధురి, భాగ్య, అశ్విని, అమల, రజిత, అంగన్వాడీ టీచర్లు శోభ, స్వరూప, పాఠశాల సిబ్బంది సంజీవ్, శ్యామల, లక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు సావిత్రీబాయి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.
దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకుడు సంతోష్రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు శేషారావు, భానుప్రకాశ్రావు, శ్రీనివాస్, రాజశేఖర్, భాస్కర్, సురేందర్గౌడ్, రాజేందర్, బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూర్ మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు లింబాద్రి, ఉపాధ్యాయులు విజయ నిర్మల, లింగం, గఫూర్ శిక్షక్, రాజేశ్, రవి, రాజ్యలక్ష్మి, సౌందర్య, కల్పన పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల, బోర్లం ప్రాథమిక పాఠశాలలో సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ గంగాధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు దేవిరెడ్డి, రమాదేవి, హెచ్ఎం రాంచందర్, ఉపాధ్యాయులు రజినీకాంత్, అయ్యాల సంతోష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాలికల చదువు, సతీ సహగమనం కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. పలువురు మహిళా ఉపాధ్యాయురాళ్లకు శాలువా కప్పి సత్కరించారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 3