నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ భాగం నుంచి 57,200 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ఆదివారం సాయంత్రానికి ఐదు వరద గేట్ల ద్వారా 45,700 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1405.00 అడుగులు (17.80 టీఎంసీలకు) గాను 1404.75 అడుగులు (17.44 టీఎంసీల) నీరు నిలువ ఉందని తెలిపారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టును తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.