కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
అన్నదాతల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
వేల్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
వేల్పూర్, మార్చి 31: రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పచ్చల నడ్కుడ పెద్దవాగుపై, కొత్తపల్లి పెద్దవాగుపై నిర్మించనున్న చెక్డ్యామ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొత్తపల్లి, వాడి, రామన్నపేట్, పడగల్ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను ప్రారంభించారు. పగడల్ గ్రామంలో కమ్యూనిటీ హాల్, రామన్నపేట్లో సొసైటీ గోదాం పనులను, వాడి, కొత్తపల్లి, పచ్చలనడ్కుడ గ్రామం వరకు బీటీ రెన్యువల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వాడిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కొనుగోలు కేం ద్రాలను కేంద్రం ఎత్తివేసినా.. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సును కోరి సీఎం కేసీఆర్ కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తామని ఇటీవల స్పష్టం చేశారని చెప్పారు. రాష్ట్రంలోనే మొదటి కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని రామన్నపేట్ గ్రామం లో గురువారం ప్రారంభిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.20వేల కోట్లను కేటాయించిందని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరిస్తుందని చెప్పారు.
పార్కులు, వైకుంఠధామాలు దేశానికే ఆదర్శం..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు దేశానికే ఆదర్శమని మంత్రి అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చామని, దీంతో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణకు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. గ్రామాల్లో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తున్నదని, సీఎం కేసీఆర్ ఆలోచనలతోనే ఇలాంటి కార్యక్రమాలు పూర్తిచేసినట్లు తెలిపారు.
భూగర్భ జలాల పెంపునకు చెక్డ్యామ్ల నిర్మాణం..
వాగులు, వంకల్లోని నీటిని ఒడిసి పట్టేందుకు, భూగర్భ జలాలను పెంచుకొనేందుకు చెక్డ్యామ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగులపై ఇదివరకే 12 చెక్డ్యామ్లను నిర్మించామని తెలిపారు. మరో 11 చెక్డ్యామ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణంతో అదనంగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వేముల తెలిపారు. అంతకుముందు వాడి గ్రామంలో స్వర్గీయ వేముల సురేందర్రెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీపీవో జయసుధ, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, డైరెక్టర్ శేఖర్రెడ్డి, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్చైర్మన్ సురేశ్, ఎంపీటీసీ సభ్యులు గంగారెడ్డి, భూమన్న, సత్తెమ్మ, వనజ, సర్పంచులు వేముల పద్మ, వాణి, నితీశ్కుమార్, రాజేశ్వర్, సుధాకర్గౌడ్, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు దోళ్ల రాజేశ్వర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, సొసైటీ చైర్మన్లు మోహన్రెడ్డి, రాజన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ తనిఖీలు
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్