నవీపేట, ఆగస్టు 3: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవెన్యూ ప్లాం టేషన్ను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొ న్నారు. నవీపేట మండలంలోని అభంగపట్నం వద్ద బాసర రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భం గా పలు శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. అబ్బాపూర్(ఎం) నుంచి యంచ వరకు బాసర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. హరితహారం కార్యక్ర మాన్ని ఎవరైన నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టిని సారించాలని ఎంపీడీవో సయ్యద్ సాజిద్కు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న బర్కత్పూర కాలనీలో ఆరోగ్య సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో రామకృష్ణ, కార్యదర్శులు సందీప్, రామాగౌడ్, అభంగపట్నం సర్పంచ్ రమాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోనే మోడల్ బృహత్ ప్రకృతి వనంగా ఏర్పాటు చేయాలి
రెంజల్, ఆగస్టు 3 : ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీలకు కొత్త రూపాన్నిచ్చాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని రెంజల్ బృహత్ ప్రకృతి వనాన్ని జిల్లాలోనే మోడల్ వనంగా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం పక్కనే ఎంపిక చేసిన బృహత్ ప్రకృతి వనం స్థలాన్ని ఆమె పరిశీలించారు. ప్రభుత్వం సంకల్పించిన పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, ఒక చిల్డ్రన్ పార్కు, నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేలా వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. బృహత్ వనంలో మొ క్కలు నాటడంలో భాగంగా కూలీల కొరతను అధిగమించేందుకు ఉపాధి కూలీలతో లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి మీటర్కు ఒక మొక్క చొప్పున గొరింటాకు, వెదురు, ఉసిరి, చింత, రావి, ఇతర మొక్కలను నాటాలని ఆదేశించారు. అంతకు ముందు కూనేపల్లి, వీరన్నగుట్ట, రెంజల్ గ్రామా ల్లో ప్రారంభమైన జ్వర సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంపీవో గౌసొద్దీన్, రెంజల్ సర్పంచ్ రమేశ్కుమార్, ఏపీవో శరత్, కార్యదర్శి యాదగిరి తదితరులు ఉన్నారు.