మాక్లూర్, మార్చి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తుండగా.. వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి మం దులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సం దర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఎంపీడీవో జైక్రాంతి, డాక్టర్ సరిత, ఏపీఎం అనిల్కుమార్, ఉప సర్పంచ్ లక్ష్మి, క్యాంప్ వైద్యులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు వివరాలు
కామారెడ్డి/ విద్యానగర్, మార్చి 21: కామారెడ్డి జిల్లాలో మంగళవారం 5,191 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 627 మందికి కళ్లద్దాలు అందజేశామని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 2,29,693 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 35,856 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 8,978మందికి కంటి పరీక్షలు నిర్వహిం చి, 969 మందికి కళ్లద్దాలను అందజేసినట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు 2,96,535 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. 68,334మందికి కళ్లద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు.