కామారెడ్డి/ నిజాంసాగర్/బీర్కూర్/ గాంధారి/ నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి, ఏప్రిల్, 27 : హైదరాబాద్లోని హైటెక్స్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు. జిల్లా నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, కామారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్తోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్లీనరీలో జిల్లా నేతలు మంత్రులతో సందడి చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఫొటోలు దిగారు.
ప్లీనరీకి తరలిన వారిలో నిజాంసాగర్ మండలం నుంచి ఎంపీపీ జ్యోతిదుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, బీర్కూర్ నుంచి మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, జడ్పీటీసీ స్వరూప, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరేశం ఉన్నారు. గాంధారి నుంచి తరలిన వారిలో మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీరావు, సత్యంపటేల్, ఎంపీపీ రాధాబలరాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దబూరి సత్యం,విండో మాజీ చైర్మన్ ముకుంద్రావు, శివాజీరావు తరలివెళ్లారు. నాగిరెడ్డిపేట్ మండలం నుంచి ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ బోయిని రాధ, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య తరలివెళ్లారు. ఎల్లారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, జడ్పీటీసీ సభ్యుడు ఉషాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్ పాల్గొన్నారు.