సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
అక్బర్నగర్లోని ప్రకృతి ఆశ్రమంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
హాజరైన సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ
రుద్రూర్, మార్చి 26 : ప్రకృతి ఆశ్రమం ఒక దేవాలయం వంటిదని, అక్బర్నగర్ ప్రకృతి ఆశ్రమానికి ఇతర రాష్ర్టాల్లో మంచి గుర్తింపు ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అక్బర్నగర్లోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో పలు అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. స్పీకర్తో కలిసి ఆశ్రమంలో వాటర్ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు పూర్తయిన నూతన భవనాన్ని ప్రారంభించారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అక్బర్నగర్ ప్రకృతి ఆశ్రమంలో తాను ఇటీవల చికిత్స చేయించుకున్నానని, సిబ్బంది పనితీరు బాగుందని అభినందించారు. ప్రకృతి ఆశ్రమం అభివృద్ధి చెందడానికి కారణం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలబడిన గొప్ప వ్యక్తి స్పీకర్ అని, అలాంటి నాయకుడు బాన్సువాడకు ఉండడం ప్రజల అదృష్టమన్నారు.
ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మందులు కాకుండా కేవలం ప్రకృతిఒడిలో చికిత్స అందించాలన్న ఆకాంక్షతో ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అక్బర్నగర్ ఆశ్రమానికి స్పీకర్ మాత్రం ఎంతో కృషిచేస్తున్నారని అన్నారు. ఆశ్రమంలో యోగశాలతోపాటు వాకింగ్ కోసం స్థలం, మరోభవన నిర్మాణం తదితర పనుల కోసం మరో రూ.50 లక్షలు మంజూరు చేస్తామని స్పీకర్ తెలిపారు.
అనంతనం అక్బర్నగర్ గ్రామ పంచాయతీ భవనం, బీసీ కమ్యూనిటీ హాలు, మసీదు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు 54 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అంబం గ్రామంలో సైతం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సర్పంచులు గంగామణి, భాగ్య, సీనియర్ నాయకులు పత్తి రాము, సంజీవ్, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.