విద్యానగర్/బాన్సువాడ టౌన్/భిక్కనూర్/బీబీపేట్/నస్రుల్లాబాద్(బీర్కూర్)/నిజాంసాగర్/ఎల్లారెడ్డి, జూలై 17 :జిల్లా ప్రజలు బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. జిల్లా కేంద్రంలోని దేవీ విహార్ పేస్-2 వాసులు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి, కాలనీ కమిటీ అధ్యక్షుడు సుభాష్గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రావు, కోశాధికారి శ్రీనివాస్, వెంకట్రావ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూర్ మండల కేంద్రంలో గంధంవారి పాండి ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. బీబీపేట్ మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇంటింటి నుంచి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు.
బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. బీర్కూర్శివారులోని కొటారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం శివారులోని మైసమ్మ ఆలయానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వన భోజనాలు చేశారు.
నిజాంసాగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో నల్లపోచమ్మకు బోనాలను సమర్పించారు. బ్యాండ్ మేళాల మధ్య బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి.. అమ్మవారికి సమర్పించారు.
ఎల్లారెడ్డిలో బోనాలను ర్యాలీగా ఆటాపాటలు, డీజే చప్పుళ్ల మధ్య తీసుకువచ్చి ఎల్లమ్మకు సమర్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సంగని బాలమణి, నాయకులు పద్మారావు, సంగని పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీలో నిర్వహించిన బోనాల పండుగలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పాల్గొని బోనమెత్తారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు నార్ల ఉదయ్, కనుకుంట్ల రాజు, కాలనీ వాసులు పాల్గ్గొన్నారు.