బీర్కూర్, జూలై 5 : మండలకేంద్రంలోని మాదిగ, మాలవాడలోని కమ్యూనిటీ భవనాల్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు బోయి లాలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి దళిత క్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి, రూ.1200 కోట్లను ప్రకటించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్పటేల్, కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, యువజన విభాగం మండలాధ్యక్షుడు మియాపురం శశికాంత్, గ్రామ అధ్యక్షుడు దుంపల రాజు, ప్రధానకార్యదర్శి కొరిమె రఘు పాల్గొన్నారు.