బాన్సువాడ, నవంబర్ 18 : ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ నోరుజారితే సహించబోమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడలోని టీఆర్ఎస్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ నిజామాబాద్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో, ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోవడంతో నాయకులకు మతిభ్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్కు ఇంకా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందనేది ప్రజలకు తెలుసని అన్నారు. కవితను కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కార్గె ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నావని, కార్గె కలలోకి వచ్చి చెప్పాడా అని ఎద్దేవాచేశారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని చెప్పి.. అసలు కనీసం పసుపు బోర్డు కోసం ఎకరం స్థలమైనా తెచ్చావా అని ప్రశ్నించారు.
అర్వింద్ తన ఇల్లు, తన తల్లిపై టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యకర్తలు దాడి చేశారని చెప్పారని, కొద్దిసేపటికే తన తల్లి బయటికి వచ్చి చూస్తే గందరగోళంగా ఉందని, తనకేమీ తెలియదని చెప్పారని, తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టంచేశారని వివరించారు. మీడియా ముందు అబద్ధపు మాటలు మాట్లాడావని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబద్ సెగ్మెంట్లో కవిత నీపై పోటీ చేస్తుందని, నిన్ను అదే నియోజకవర్గంలో ఓడించి భారీ మెజార్టీతో గెలుస్తుందని డీసీసీబీ చైర్మన్ ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు రోడ్డుపై తిరగనియ్యరని అన్నారు. బాన్సువాడలో అర్వింద్, సంజయ్ మాట్లాడుతూ.. బాన్సువాడలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదని చెప్పారని, నీ స్టేజీ వెనుక 500 ఇండ్లు ఉంటే కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, బీర్కూర్ వైస్ ఎంపీపీ కాశీరాం, సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, హైమద్, షకీల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.