కోటగిరి, నవంబర్ 7: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని వల్లభాపూర్ చెరువులో సోమవారం 26 వేల చేప పిల్లలను విడుదల చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మొదటి విడుతలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇంటిని ప్రారంభించారు. అనంతరం రూ.30లక్షల వ్యయంతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా ఏర్పాటు సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణను పాల పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికే 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని, ఇప్పటికే సగం కన్నా ఎక్కువ గృహ ప్రవేశాలు అయ్యాయని స్పీకర్ తెలిపారు. గతంలో కన్నా రాష్ట్రం సాధించుకున్నాకే ఆలయాల అభివృద్ధి జరుగుతున్నదన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు 150-200 ఆలయాలు మంజూ రు, మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. సబ్సిడీపై అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనవిధంగా రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు రూపంలో ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెడితే వేల కోట్లు నిధులు ఇస్తానని ప్రధాని మోదీ ప్రకటించినా రైతులకు భారం కాకూడదని తిరస్కరించిన సీఎం కేసీఆర్కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్పటేల్, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ ఫారూఖ్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, దేవాదాయ శాఖ అధికారి సోమయ్య, పార్టీ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొల్లూర్ కిశోర్బాబు, ఎత్తొండ విండో చైర్మన్ అశోక్పటేల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, తేళ్ల అరవింద్, బర్ల మధు, హౌసింగ్ డీఈ నాగేశ్వరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.