సత్తుపల్లి, జూన్ 20: వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని కొత్తూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మద్దకు ధరకు ధాన్యం కొనుగోలు చేశారని వివరించారు. ఆ నగదును కూడా వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని అన్నారు. యాసంగిలో అధిక దిగుబడులు రాగా మిల్లర్లు ధాన్యం దిగుమతికి ఒప్పుకోకపోవడంతో తాను ప్రత్యేకంగా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులను, వ్యవసాయశాఖ కమిషనర్ను కలిసి ధాన్యం ఎగుమతులను వెంటనే చేపట్టాలని కోరానన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందన్నారు. సత్తుపల్లికి 100 బెడ్ల ఆసుపత్రిని మంజూరుచేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, గాదె సత్యం, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుళ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాగంటి శ్రీను, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, మట్టా ప్రసాద్, గోగులమూడి బాలాజీరెడ్డి, మందపాటి ముత్తారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, పగుట్ల వెంకటేశ్వరరావు, పెద్దిరాజు, కంచర్ల నాగేశ్వరరావు, మల్లూరి అంకమరాజు, వెల్ది జగన్మోహనరావు, తుమ్మూరు దామోదరరెడ్డి, కాలినేని వెంకటేశ్వరరావు, కొడిమెల అప్పారావు, నడ్డి జమలయ్య, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కరోనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పంటలకు ముందుగానే రైతుబంధు సాయాన్ని అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. మండలంలోని కొత్తూరు రైతువేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే సండ్ర పుష్పాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ యాసంగిలో అధిక దిగుబడి వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం, ముందుగానే రైతుబంధు సాయం అందించడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు.