బాల్కొండ, నవంబర్ 7 : వేల్పూర్ మండలంలోని మోతె గ్రామ పంట పొలాల్లో రసాయనాలు స్ప్రే చేసే అత్యాధునిక డ్రోన్ కెమెరాను సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆవిష్కరించారు. ఆధునిక యంత్రాల వినియోగంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చన్నారు. డ్రోన్ను ఆవిష్కరించిన అనంతరం దాని పనితీరును మంత్రి స్వయంగా పరిశీలించారు.
సుందరీకరణ పనుల పరిశీలన
భీమ్గల్ పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. లింబాద్రి గుట్ట రథోత్సవంలో పాల్గొని తిరుగు ప్రయాణం లో పట్టణంలో జరుగుతున్న డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించారు. రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి. పనులు త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంత్రి వెంట ము న్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, అధికారులు ఉన్నారు.