బాల్కొండ, నవంబర్ 7 : రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని.. అయినప్పటికీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారని రాష్ట్ర హౌసింగ్, రోడ్లు-భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీని ఆదరిస్తున్నారని, దీనికి మునుగోడులో ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని తెలిపారు. వేల్పూర్ మం డల కేంద్రంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుల ఆధ్వర్యంలో ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించిన సందర్భంగా సోమవారం సంబురాలను నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన కుల సంఘాల భవనాల ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చర్చ జరుగుతుందన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు కా వడం లేదన్నారు. దేశంలోనే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సబ్బండ వ ర్గాలు ఆనందంగా ఉన్నాయన్నారు. దేశంలో కులా లు, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ బీజేపీ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని మండిపడ్డారు. యావత్ భారత దేశం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నాయత్వమే శ్రీరామ రక్ష అని మం త్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజా ప్రతినిధులు, నాయకులు స్వీట్లు తినిపించారు. అనంతరం మంత్రి భీమ్గల్ లింబాద్రి గుట్ట బ్ర హ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మం త్రి రథం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు.