సదాశివనగర్, సెప్టెంబర్ 30: ధాన్యం కొనుగోళ్లలో అడ్లూర్ ఎల్లారెడ్డి విండో జిల్లాలోనే రెండో స్థానంలో ఉన్నదని విండో చైర్మన్ మర్రి సదాశివారెడ్డి అన్నారు. విండో ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన మహాజన సభలో సీఈవో కండెం భైరయ్య సహకార సంఘం ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. చైర్మన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లతో రూ.32,95,282 కమీషన్ వచ్చిందని తెలిపారు. నాబార్డు నిధులు రూ.75లక్షలతో రామారెడ్డి, ఉప్పల్వాయి, కుప్రియాల్, మో షంపూర్, గిద్ద గ్రామాల్లో గోదాములు, అడ్లూర్ ఎల్లారెడ్డిలో షెడ్, క్రిమి సంహారక మందుల దుకాణాన్ని నిర్మిస్తామని తెలిపారు. మహాజన సభలో విండో వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, రామారెడ్డి ఎంపీపీ, జడ్పీటీసీలు దశరథ్రెడ్డి, మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్రావు, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
సొసైటీ అభివృద్ధికి కృషి..
బిచ్కుంద సొసైటీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని విండో ఉపాధ్యక్షుడు యాదవరావు అన్నారు. బిచ్కుంద సొసైటీ మహాజన సభలో వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు సాగుచేసుకోవడానికి శన గ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించాలన్నారు. మహాజన సభలో సొసైటీ కార్యదర్శి శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.