ఎల్లారెడ్డి/గాంధారి, సెప్టెంబర్ 26 : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందజేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బతుకమ్మ పండుగ సారెను అందుకుంటున్న ప్రతి తల్లీ, చెల్లి.. అదే చేతులతో ముఖ్యమంత్రిని దీవించాలని కోరారు. ఎల్లారెడ్డి పట్టణంతోపాటు గాంధారి మండలంలో సోమవారం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గాంధారి మండలంలోని మాతు సంగెం, గండివేట్ గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. గండివేట్లో నిర్మించిన రైతువేదిక, మార్కెట్ యార్డు మడిగెలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు. తెలంగాణ రాకముందు మనల్ని ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల వారిని పార్టీలకు అతీతంగా సమానంగా చూస్తున్నారని అన్నారు. కేంద్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలను పెంచి ప్రజలను పీడిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తుంటే, కేంద్రమేమో మోటర్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చూస్తున్నదని అన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15లక్షల చొప్పున జమచేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. మాట తప్పిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎన్నికల సమయంలోనే రైతులు గుర్తుకువస్తారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగేసి దేశానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, ఆర్డీవో శ్రీను, జడ్పీటీసీ ఉషాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు జలంధర్రెడ్డి, గాంధారి ఏఎంసీ చైర్మన్ సత్యంరావు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గాంధారి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధబలరాం, తహీసల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సతీశ్, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, విండో చైర్మన్లు సాయికుమార్, సాయిరాం, సర్పంచులు ఫారూక్, భాస్కర్, సంజీవ్, ఎంపీటీసీలు శ్రీనివాస్, సారికా శ్రీనివాస్, సుమిత్రా శ్రీనివాస్, రాములు, టీఆర్ఎస్ నాయకులు ముకుంద్రావు, శివాజీరావు, సంగారావు పాల్గొన్నారు.