Three phase electricity | కామారెడ్డి జిల్లా మాచా రెడ్డి మండలం పాల్వంచ మర్రి చౌరస్తా వద్ద త్రీ ఫేజ్ కరెంటు సప్లై సరిగా చేయడం లేదంటూ కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారిపై పాల్వంచ, చుక్కాపూర్, వాడి, ఫరీద్ పెట్, మంతన్ దేవునీపల్లి గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. త్రీ ఫేజ్ కరెంటు సరిగా సప్లై కాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు ట్రాన్స్ కో, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ అధికారాలపై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాణ్యమైన కరెంటును వ్యవసాయ బోరు బావులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.