ఖలీల్వాడి: ఢిల్లీలో తలపెట్టిన తెలంగాణ భవన నిర్మాణ పనులను ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ అండ్ క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఢిల్లీ వెళ్లి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.