కమ్మర్పల్లి, డిసెంబర్ 31: దాతలు ఆర్థిక సాయం అందించి బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతూ చికిత్స పొందుతున్న తమ కుమారుడు మధు(14)ను ఆదుకోవాలని ఉప్లూర్కు చెందిన సువర్ణ, రాజు దంపతులు వేడుకుంటున్నారు. ఉప్లూర్కు చెందిన బాలుడు మేకల మధు కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్తో హైదరాబాద్లో ఎంఎన్జీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం ఉచితంగా అందిస్తున్నపటికీ ప్రతి రోజూ తెల్ల రక్తకణాల కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతున్నది. ట్రాక్టర్ డైవర్గా పని చేసే రాజు, బీడీలు చుట్టే సువర్ణకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. 8247574210 నంబరుకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపాలని కోరారు.
మున్నూరు కాపు యూత్ ఆర్థిక సాయం
బ్లడ్ క్యాన్సర్తో చికిత్స పొందుతున్న బాలుడు మధుకు ఉప్లూర్కు చెందిన మున్నూరు కాపు నవ చైతన్య యూత్ సభ్యులు అవారి గంగా రెడ్డి, అవారి మోహన్, అవారి శ్రీనివాస్, అవారి నరేశ్, అవారి అశోక్, ఆకుల రమేశ్, చిలుకూరి సురేశ్, చిలుకూరి మారుతి, చిలుకూరి అజయ్ అవారి నరేశ్, అవారి సంతోష్, తక్కూరి రాజేందర్ రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు.ఈ సహాయాన్ని బాధిత బాలుడి అన్నకు అందజేశారు.