నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 13 : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా వాకిటి చిన్న భోజన్న (వసుంధర), ఉపాధ్యక్షులుగా నాయక భోజేందర్, తల్వేద నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి చిన్న నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా నాగభూషణ్, కోశాధికారిగా బుర్ర అన్న ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు.
డిచ్పల్లి మండలం ఘన్పూర్, బర్ధిపూర్ గ్రామాల కమిటీలను ఎన్నుకున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ తెలిపారు. ఘన్పూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా గడ్డం గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఎ.దశరథ్తోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బర్ధిపూర్ గ్రామకమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా పైడిపల్లి నర్సయ్య, ఎండీ షాదుల్లాను ఎన్నుకున్నారు.
సిరికొండ మండలం పందిమడుగు, తాటిపల్లి గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట రాజన్న తెలిపారు. పందిమడుగు గ్రామకమిటీ అధ్యక్షుడిగా మలావత్ గోవింద్, తాటిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మలావత్ తిరుపతినాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోటగిరి మండలంలో గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పార్టీ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ప్రజాప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్ తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మారయ్య, మల్కాపూర్ తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గోపాల్నాయక్, ప్రధాన కార్యదర్శిగా గులాబ్సింగ్, చక్రధర్నగర్ తండా అధ్యక్షుడిగా అమ్రూనాయక్, ప్రధాన కార్యదర్శిగా బాబునాయక్ ఎన్నికయ్యారు.
రుద్రూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పత్తి లక్ష్మణ్ మరోసారి ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పోచారం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.
నవీపేట మండలం అబ్బాపూర్(ఎం)లో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ న్యాలకంటి సాయిలు, నవీపేట సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇంగోలి సాయిలు, ఉపాధ్యక్షులుగా మేకల భూమన్న, బట్టు సాయిలు, కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా నీరడి కిరణ్, ప్రధాన కార్యదర్శి దండు గంగారాం, సంయుక్త కార్యదర్శిగా బట్టు ఒడ్డెన్న, ప్రచార కార్యదర్శిగా గైనిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎంపీటీసీ సాయిలు తెలిపారు. పొతంగల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ రవీందర్ నియామక పత్రాన్ని అందజేశారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ అనుబంధ కమిటీలను సోమవారం ఎన్నుకున్నట్లు మండలాధ్యక్షుడు భూమారెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా భూమేశ్, ప్రధాన కార్యదర్శిగా గంగాధర్, ఉపాధ్యక్షులుగా బాబు, మదార్, యువత అధ్యక్షుడిగా నరేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సురేశ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా సంతోష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా హైమద్తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీను, ఉపాధ్యక్షుడిగా శేఖర్గౌడ్, యూత్ అధ్యక్షుడిగా మహేశ్, ముత్యంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మీసాల శ్రీనివాస్, కల్లడి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిన్న రమేశ్, ప్రధాన కార్యదర్శిగా లడ్డూరి సాయన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ ఇన్చార్జి, స్థానిక నాయకులు వారికి నియామకపత్రాలను అం దజేశారు. ఆర్మూర్ పట్టణంలోని 27, 29వ వార్డులకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. 27వ వార్డు కమిటీ సభ్యుడికి టీఆర్ఎస్ నాయకుడు పండిత్ ప్రేమ్, 29వ వార్డు కమిటీ సభ్యుడికి నచ్చు చిన్నారెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
బోధన్ మండలంలోని హున్సా, ఖాజాపూర్, హంగర్గ గ్రామ కమిటీలను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్, మండల అధ్యక్షుడు నర్సన్న, కార్యదర్శి సిర్ప సుదర్శన్, సంజూపటేల్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. హున్సా గ్రామ అధ్యక్షుడిగా గంగాధర్పటేల్, ఖాజాపూర్ అధ్యక్షుడిగా శివకుమార్, హంగర్గ అధ్యక్షుడిగా శివకుమార్ను ఎన్నుకున్నారు.